నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామన్నారు: డి. శ్రీనివాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తామని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. తాను పోటీ చేస్తున్న నిజామాబాద్ అర్బన్ శాసనసభా నియోజక వర్గంలో ఆయన బుధవారం ప్రజలతో మాట్లాడారు. సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని, ఆ విషయం తనతో సోనియా కచ్చితంగా చెప్పారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంతో దూరంలో లేదని, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తనను శాసనసభకు గెలిపిస్తే మంచి స్థానంలోకి వెళ్తానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X