వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి పిలుపు: వైయస్ జగన్ యాత్రకు అనుమతి ఇస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ‌: శ్రీకాకుళం జిల్లాలో జులై 8వ తేదీ నుంచి ఓదార్పు యాత్ర తలపెట్టిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం నుంచి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ తల్లి విజయలక్ష్మితో కలిసి ఢిల్లీ బయలుదేరారు. నెలాఖరులో రెండు రోజుల పాటు అందుబాటులో ఉండాలని అధిష్టానం జగన్ కు సూచించినట్లు సమాచారం. దీంతో జగన్ మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో మకాం వేయనున్నారు. జగన్ తో అధిష్టానానికి చెందిన పెద్దలు ఏం మాట్లాడ్తారనే విషయం తెలియడం లేదు. ఆయన ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇస్తుందా, వద్దని నచ్చజెప్పుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతంలో వైయస్ విజయలక్ష్మి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో జగన్ కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు భావిస్తున్నారు. జగన్ అధిష్టానానికి చెందిన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ తదితరులను స్వయంగా కలిసే అవకాశాలున్నాయి. అలాగే, తల్లి విజయలక్ష్మితో కలిసి సోనియా గాంధీతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వయంగా మాట్లాడడానికే సోనియా జగన్ ను ఢిల్లీ పిలిచినట్లు భావిస్తున్నారు. ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని సోనియా జగన్ కు సూచించవచ్చునని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X