ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఆజాద్ హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Adilabad Dist
ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఆజాద్ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒక మావోయిస్టు ఆజాద్ కావచ్చునని అనుమానిస్తున్నారు. ఎకె 47 లభించడంతో ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో ఆజాద్ మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ ను పట్టుకుని కాల్చి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా ఆయన ఆచూకీ తెలియడం లేదని మావోయిస్టు నేతలు ప్రకటనలు కూడా విడుదల చేశారు. దీంతో ఆ అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు. వాంకిడి మండలం వెలిగి-సర్కేపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలంలో ఏకే 47, 2 కిట్‌బ్యాగులను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X