వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు దాటితే చంద్రబాబును అరెస్టు చేస్తాం: ఆర్ఆర్ పాటిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

RR Patil
ముంబై: రాష్ట్ర సరిహద్దులు దాటితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తామని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న బస్సు యాత్రపై ప్రస్తావన సందర్భంగా ఆయన శుక్రవారం శాసన మండలిలో ఆ విషయం చెప్పారు. సరిహద్దులు దాటితే చంద్రబాబుతో సహా ఎవరినైనా అరెస్టు చేస్తామని నాందేడ్ ఎస్పీ కూడా చెప్పారు. కాగా, తెలుగుదేశం బస్సు యాత్రకు నిరసనగా నాందేడ్ పార్లమెంటు సభ్యుడు ధర్మాబాద్ వద్ద ధర్నాకు దిగారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఇదిలా వుంటే, ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. చంద్రబాబునాయుడు తమ పార్టీ నాయకులతో ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్యాహ్న భోజనం చేసి ధర్మాబాద్ వైపుగా సాగారు. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దుల్లో 144వ సెక్షన్ విధించారు. ఈ నిబంధలను ఉల్లంఘిస్తే అరెస్టు చేయక తప్పదని నాందేడ్ ఎస్పీ అన్నారు. బాబ్లీ బచావో సంఘర్షణ సమితి కార్యకర్తలు పెద్ద యెత్తున రాష్ట్ర సరిహద్దు వద్దకు చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X