మహా దౌర్జన్యంపై తిరగబడ్తాం, విప్లవం తెస్తాం: బాలకృష్ణ

Balakrishna
హైదరాబాద్: చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల పట్ల మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా ఓపిక నశిస్తుందని, ఓపిక నశిస్తే తెలుగు ప్రజలు తిరగబడి, కాంగ్రెసుకు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. విప్లవం తేవాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మన హక్కుల కోసం తాము పోరాడుతున్నామని, మనకు రావాల్సిన వాటా కోసం మనం పోరాటం చేస్తున్నామని, అందుకు తిరగబడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. మంగళవారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెసు విదేశాలకు తాకట్టు పెడుతోందని ఆయన విమర్శించారు.

తమ పార్టీ నాయకులను తీవ్రవాదుల మాదిరిగా, ఉగ్రవాదులలాగా చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం భూములను కబ్జా చేసి సంపన్నులకు కట్టబెడుతోందని, ఇటీవలే సినీ పరిశ్రమకు చెందిన భూమిని అక్రమంగా సంపన్నులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని చూశామని ఆయన చెప్పారు. సోంపేట వంటి సంఘటనలు చూస్తే కాంగ్రెసు ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుందని ఆయన అన్నారు. అప్రజాస్వామికంగా సంపన్నులకు ప్రజా సంపదను దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. తాను చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం నాయకులను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో కూడా తెలియడం లేదని, వారిని ఎక్కడ ఉంచుతారో తేలిన తర్వాత పరామర్శకు వెళ్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+