అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణదేవరాయల వైస్ చాన్సలర్ కుసుమకుమారి తొలగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: అనంతపురం శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కుసుమకుమారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కుసుమకుమారి హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. కుసుమకుమారిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆ చర్య తీసుకుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కుసుమకుమారిని తొలగించిదంి. కడప యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ రామచంద్రారెడ్డి కృష్ణదేవరాయల వర్శిటీ ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాగా, ఇంజనీరింగ్ విద్య మరింత భారం కానుంది. ఫీజులను పది శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థులపై ఇతోధిక భారం పడనుంది. ఫీజులు పెంచాలని గత కొంతకాలంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఫీజులు పెంచకపోతే కళాశాలలను నడపలేమని హెచ్చరిస్తూ వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X