హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ ద్రోహి: ఈటెల రాజేందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Etala Rajender
హైదరాబాద్‌: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి లాగే ఆయన కుమారుడు జగన్‌ కూడా తెలంగాణ ద్రోహీ అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. జగన్‌కు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని, జగన్‌ కాదు కదా.. ఆయన జేజమ్మ దిగివచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు తెలంగాణలో ప్రజలు ఓట్లు వేయరని రాజేందర్‌ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఓదార్పు యాత్ర తదితర విషయాలు అరిగిపోయిన రికార్డులని విమర్శించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అంటూ చంద్రబాబు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్యామండలి ఏర్పాటై 22 ఏళ్త్లెనా ఇప్పటికీ తెలంగాణ వ్యక్తికి ఛైర్మన్‌ పదవి ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు కూడా కేసీరెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని చూడటం దుర్మార్గమని ఈటెల వ్యాఖ్యానించారు. ఈ సారైన తెలంగాణ వ్యక్తికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి 20 టిఎంసిల నీటిని ఎల్ఎండీకి విడదుదల చేసి కరీంనగర్, వరంగల్ లకు మంచినీరు అందించాలని ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X