డిఎల్ రవీంద్రారెడ్డి, జెసి దివాకర్ రెడ్డిపై సాక్షి డైలీ మండిపాటు

ఎపిఐఐసి భూములు అప్పగిస్తున్నప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు చిట్టా విప్పుతామని అంటున్నారని, వైయస్ తిరిగి రాలేరు - సమాధానం ఇచ్చుకోలేరు - అదే వారి ధీమా అంటూ సాక్షి రాసింది. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఓ దారుణమైన కుట్ర ప్రారంభమైందని ఆరోపించింది. వైయస్ నిర్ణయాల్లో పాలు పంచుకున్నవారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది. పిఆర్పీ నాయకుడు చిరంజీవి ఆరోపణలు చేస్తే అందులో తప్పేముందని కాంగ్రెసు సీనియర్లు కె కేశవరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సమర్థించారని కూడా వాపోయింది. మొన్న అదే మాట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటే వెనకేసుకచొచ్చారని సాక్షి దినపత్రిక తప్పు పట్టింది.












Click it and Unblock the Notifications