తుపాకి మిస్ ఫైర్ తో హైదరాబాదులోని కానిస్టేబుల్ మృతి
Districts
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో గల సిఎఆర్ హెడ్ క్వార్టర్ లో సోమవారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. తుపాకి మిస్ ఫైర్ అయి సోమప్ప అనే కానిస్టేబుల్ మరణించాడు. తుపాకిని శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తుపాకి గుండు అతని గొంతులోంచి దూసుకుపోయింది.
సోమప్ప మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. అజాగ్రత్త వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.