హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడ్తా: ఒయు విసి తిరుపతి రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirupati Rao
హైదరాబాద్: సమస్యపై తాను ప్రభుత్వంతో మాట్లాడతానని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరుపతి రావు హామీ ఇచ్చారు. ఆర్ట్స్ కళాశాలపైకి ఎక్కి నలుగురు విద్యార్థులు కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడికి వచ్చారు. కిందికి దిగిరావాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. తమ విశ్వవిద్యాలయంలో సమస్య తలెత్తింది కాబట్టి తాను ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. సమస్యపై తాను ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన అన్నారు. వాటా విషయంపై తాను ఏమీ చెప్పలేనని, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేమిటో తనకు తెలియదని, ప్రభుత్వంతో చర్చిస్తే తప్ప తనకు ఏమీ తెలియదని, అది కేవలం తమ విశ్వవిద్యాలయానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని ఉంటుందని, ప్రస్తుత పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే తమకు అవకాశాలు పోతాయని విద్యార్థులు అనుకుంటున్నారని, దానిపై ప్రభుత్వంతో చర్చిస్తానని ఆయన అన్నారు. పిల్లల ఆలోచనను, ఆవేదనను తాను ప్రభుత్వానికి వినిపిస్తానని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని తాను విద్యార్థులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని విద్యార్థులే ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నారని, దానికి విద్యార్థులు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X