అంబటి రాంబాబుపై కేసుకు ఎసిబి కోర్టు ఆదేశం

Ambati Rambabu
హైదరాబాద్: ఏపీపీఐఐసీ - ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ న్యాయవాది శ్రీరంగారావు వేసిన పిటీషన్ పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు నాటి ఏపీపీఐఐసీ చైర్మన్ అంబటి రాంబాబు, ఐఏఎస్ అధికారులు పార్థసారథి, బి.పి.ఆచార్యలపై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ని ఆదేశించింది. ఎమ్మార్ అక్రమాలపై న్యాయవాది శ్రీరంగారావు 700 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. ఏపీపీఐఐసీ సంస్థ ఎమ్మార్, ఎంజిఎఫ్ తో సహా 16 కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.

కేసు నమోదుపై అంబటి రాంబాబు స్పందించారు. తనపై కుట్రతోనే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీపీఐఐసీ - ఎమ్మార్ వ్యవహారాన్ని తమ పార్టీ నాయకులే ఎక్కువ రాద్దాంతం చేస్తున్నారని, ఏపీపీఐఐసీకి రెండేళ్లపాటు తాను చైర్మన్ గా వ్యవహరించానని, ఆ సమయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తను విచారణకు సిద్ధంగా ఉన్నానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+