రాసుకుంటే రామాయణం, చెప్పుకుంటే భాగవతం: కె చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
ఆదిలాబాద్: సీమాంధ్ర నాయకులు చేసిన అన్యాయాన్ని రాసుకుంటే రామాయణం, చెప్పుకుంటే భాగవతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద యెత్తున మంగళవారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీమాంధ్ర నాయకులు చేసిన మోసాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే డిమాండ్ వచ్చిందని ఆయన అన్నారు. సందర్భం ఏదైనా తెలంగాణ వైపే ఉండాలని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్ర నాయకులు రాజీనామాల డ్రామా ఆడి ఆపారని ఆయన అన్నారు.

రాజీనామాలు చేసిన తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు ఇంగితం మరిచిపోయి ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారని ఆయన అన్నారు. భూకంపం సృష్టించైనా తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం సహాయ నిరాకణ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ తీరుపై ఆయన మండిపడ్డారు. తూపాకి నీడలో పరీక్ష నిర్వహిస్తారా అని ఆయన అడిగారు. తెలంగాణలో 85 శాతం పేదలున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+