హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉద్యమం: కేశవ రావు సమన్వయ మంత్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం విషయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత కె. కేశవరావు సమన్వయ మంత్రం జపిస్తున్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు పరస్పరం తిట్టుకోవడం మానుకుని ఉద్యమంలో సమన్వయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత బాధ్యతగా ముందుకు తీసుకుని పోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ లో తలపెట్టిన తెలంగాణ త్యాగధనుల సభకు బయలుదేరడానికి ముందు కాంగ్రెసు నాయకులు హైదరాబాదులోని గాంధీభవన్ నుంచి గన్ పార్కు వరకు శనివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాలకు తమ పార్టీ బలాన్నిస్తుందని ఆయన చెప్పారు.

తెలంగాణ సాధనలో కాంగ్రెసు పార్టీకి బాధ్యత ఎక్కువగా ఉందని, పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశం ఉందని, తెలంగాణ రాష్ట్రాన్ని తాము తప్పకుండా సాధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆత్మత్యాగాలు వద్దని ఆయన యువతకు సూచించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులూ ఎత్తివేయించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ హోం మంత్రి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి చెప్పారు. కేసుల ఎత్తివేత, ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దు తమ ప్రధాన అంశాలని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X