విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు ప్రత్యేక బెంచి కోసం సీమాంధ్ర లాయర్ల ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
విజయవాడ: సీమాంధ్ర లాయర్లు తమకు ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నాను చేపట్టారు. విజయవాడ - గుంటూరు ల మధ్య ఆ బెంచ్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ధర్నాలో సీమాంధ్రకు చెందిన 9 జిల్లాల లాయర్లు పాల్గొన్నారు. రాష్ట్రానికి రెండు బెంచీలు అవసరమని వారు అంటున్నారు. హైకోర్టు తీర్పు కోసం అంత దూరం రావడం సీమాంధ్రులకు కష్టంగా ఉంటుందని, ఇందు కోసం తమకు సీమాంధ్రలో అందరికీ అనువైన ప్రాంతమైన చోట బెంచీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సీమాంధ్ర లాయర్లు చేపట్టిన ధర్నాకు మద్దతును ప్రకటించడానికి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ధర్నా ప్రాంతాన్ని సందర్శించాడు. సీమాంధ్రకు ప్రత్యేక బెంచ్ అవసరమని ఆయన పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ మాజీ జస్టిస్ సుభాషణ్ రెడ్డి దక్షిణ భారత దేశానికి ఒక సుప్రీంకోర్టు బెంచ్ కావాలని పోరాడుతున్న నేపథ్యంలో సీమాంధ్రులకు కూడా హైకోర్టు బెంచ్ అవసరమని ఆయన ధర్నా కార్యక్రమంలో పేర్కొన్నారు. లాయర్లకు మద్దతు పలికిన వారిలో ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, తంగిరాల ప్రభాకర్, మల్లాది విష్ణు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X