వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్గొండ మహిళకు ఒకే కాన్పులో నలుగు శిశువులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన సంతోషి అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. హైదరాబాదులోని సాగర్ రింగు రోడ్డులోని తిరుమల మల్టిస్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు పిల్లలు 1.58 కిలోలతో బాగానే ఉన్నప్పటికీ మరో ఇద్దరి గురుంచి మాత్రం డాక్టర్లు ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. అయితే నలుగురు పిల్లలు కూడా తల్లికి సమస్యగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నలుగురు పిల్లలకు జన్మించిన అనంతరం తల్లితో పాటు పిల్లలను పిల్లలకు ప్రత్యేక వైద్యశాల అయిన నీలోఫర్కు తరలించారు.

సంతోషి అంతకుముందు స్కానింగ్ లో చూపిస్తే ఇద్దరు పిల్లలు అని మాత్రమే చెప్పినట్లు వారి బంధువులు చెబుతున్నారు. అయితే స్ధానికంగా ఉన్న టెక్నాలజీ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. శిశువుల వెయిట్ సుమారు దగ్గరగా ఉండటం వల్ల ముగ్గురిని, నలుగురిని ఖచ్చితంగా పోల్చలేక పోవచ్చునని అంటున్నారు. అర్ధరాత్రి వచ్చినందుల ప్రసవానికి ముందు స్కానింగ్ లో చూడటానికి ఆస్కారం లేకుండా పోయిందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X