వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు అసమ్మతి మంత్రులకు ఉద్వాసన పలికిన యెడ్యూరప్ప

By Pratap
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
బెంగళూరు: కర్ణాటక బిజెపి ప్రభుత్వంలో సంక్షోభం మరింత ముదురుతోంది. నలుగురు అసమ్మతి మంత్రులకు ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప బుధవారం ఉద్వాసన పలికారు. వెంకటరమణప్ప, శివరాజ్ తంగడగి, డి. సుధాకర్, పిఎం నరేంద్ర స్వామిలను యెడ్యూరప్ప మంత్రివర్గం నుంచి తొలగించారు. అవసరమైతే శాసనసభలో మెజారిటీని రుజువు చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని యెడ్యూరప్ప చెప్పారు. ఇటీవలి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో అసమ్మతి సెగలు చుట్టుముడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 12వ తేదీలోగా శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ ముఖ్యమంత్రి యెడ్యూరప్పను ఆదేశించారు.

ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ అసమ్మతి శాసనసభ్యులు గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజకు లేఖలు అందించే అవకాశాలున్నట్లు సమాచారం. వారిలో కొద్ది మంది మంత్రులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో భాగంగానే సంక్షోభం తలెత్తిందని, తమ పార్టీలో సంభవించిన పరిణామాలపై ప్రచారం అంతా ఉత్తదేనని, బిజెపి ఐక్యంగా ఉందని, యెడ్యూరప్ప నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని కర్ణాటక బిజెపి అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప చెప్పారు. కాగా, ప్రతిపక్ష జెడి (ఎస్) నాయకుడు హెచ్ డి కుమారస్వామి బుధవారం గవర్నర్ ను కలిశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X