హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ క్యాంప్ ను వ్యతిరేకించిన మర్రి శశిధర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Marri Sashidhar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల మాత్రమే తమ కాంగ్రెసు పార్టీ గెలిచిందంటున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నాయకుల వాదనలను సీనియర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు. అయితే, ఆయన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరును గానీ వైయస్ జగన్ పేరును గానీ ప్రస్తావించలేదు. మరెవరి పేరును కూడా ఆయన ప్రస్తావించలేదు. కాంగ్రెసు పార్టీ ఏ ఒక్కరి వల్లనో గెలవలేదని, సమిష్టి కృషితోనే పార్టీ ఎన్నికల్లో గెలిచిందని ఆయన అన్నారు. జాతీయ విపత్తుల సంఘం సభ్యుడిగా నియమితులైన ఆయనకు శనివారం గాంధీభవన్ లో సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

ఇతర పదవులు నిర్వహించడానికి ప్రస్తుత పదవి అడ్డం కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణపై తన నిబద్ధతను ప్రశ్నించాల్సిన అవసరం లేదని, తెలంగాణ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. కార్యకర్తలను తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పదవుల్లో ఉన్నవారికి ఉంటుందని, కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X