టిఐఎఫ్ ఆర్ దేశానికే తలమానికం: ప్రధాని మన్మోహన్

ప్రపంచశ్రేణి కేంద్రంగా టీఐఎఫ్ ఆర్ క్యాంపస్ మారుతుందనడంలో సందేహం లేదని అన్నారు. బోధన, పరిశోధన రంగాల పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించగలమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రాభివృద్ధిని పెంపొందించుకుంటే ప్రపంచశక్తిగా నిలబడవచ్చని అన్నారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇనిస్టిట్యూట్లను నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు టీఐఎఫ్ఆర్ ప్రతినిధులు జ్ఞాపికలు అందజేశారు. ప్రధానితోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ, టీఐఎఫ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications