చిరంజీవికి దూరమే: వైయస్ జగన్ కొత్త మిత్రుడు వంగవీటి రాధ?

Vanagaveeti Radhakrishna
విజయవాడ: విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి దూరం కావాలనే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు నచ్చజెప్పుతున్నా ఆయన వినే పరిస్థితి లేదని అంటున్నారు. విజయవాడ మహాప్రభల కార్యక్రమానికి చిరంజీవిపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తిరిగి కాంగ్రెసులోకి రావడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన తన అనుచర గణంతో చర్చలు జరుపుతున్నారు.

వైయస్ జగన్ ను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పడం ద్వారా వంగవీటి రాధ తన అంతరంగాన్ని బయటపెట్టినట్లు భావిస్తున్నారు. ఆయన కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో చేతులు కలిపే అవకాశాలున్నాయని అంటున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అందరి కన్నా ముందుగా వంగవీటి రాధాకృష్ణ అందులోకి వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. విజయవాడలో శాసనసభ్యుడు శ్రీనివాస రావుకు ప్రాధాన్యం ఇస్తూ తనకు చిరంజీవి ప్రాధాన్యం తగ్గించడాన్ని వంగవీటి రాధా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏ మాత్రం ప్రజారాజ్యం పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+