వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నర్సులను రెగ్యులరైజ్ చేయకుంటే 4 జిల్లాల్లో బంద్: ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
వరంగల్: కాంట్రాక్టు నర్సులను రెగ్యూలరైజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో బంద్ నిర్వహిస్తామని ఆ పార్టీ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఈటెల వరంగల్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ వైద్యశాల నర్సులు చేస్తున్న ఆందోళన శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై నిప్పులు గక్కారు.

తెలంగాణ ఆడపడుచులైన 24 గంటలుగా ట్యాంకుపైనే ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆయన ధ్వజమెత్తారు. నర్సులు ప్రత్యేకంగా ఏమీ కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే వారు డిమాండు చేస్తున్నారని అన్నారు. ఒకే రాష్ట్రంలో నర్సులకు తెలంగాణకు ఓ న్యాయం, సీమాంధ్రులకు ఓ న్యాయం చేస్తున్న రోశయ్య ప్రభుత్వం ద్వంద నీతి అర్థమవుతుందని అన్నారు. జిల్లానుండి మంత్రులు ఉన్నప్పటికీ వారు తెలంగాణ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. వారు పదవులు కాపాడుకోవడానికే ప్రాకులాడుతున్నారని విమర్సించారు. నర్సుల డిమాండ్లు నెరవేర్చకపోతే తెరాస చూస్తూ ఊరుకోదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X