ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న ఫైనాన్షియర్: చెరలోనే మరొకతను

By Pratap
|
Google Oneindia TeluguNews

Khammam Dist
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కిడ్నాపర్ల చెర నుంచి వెంకట రెడ్డి అనే ఓ ఫైనాన్షియర్ తప్పించుకున్నాడు. కిడ్నాపర్లు మావోయిస్టుల పేరుతో ఖమ్మం జిల్లా మణగూరు మండలం పగిడేరు అటవీ ప్రాంతంలో ఇద్దరు ఫైనాన్షియర్లను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లతో పెనుగులాడి వెంకటరెడ్డి అనే ఫైనాన్షియర్ తప్పించుకున్నాడు. సుబ్బారెడ్డి అనే మరో ఫైనాన్షియర్ కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.

ప్రజల నుంచి వడ్డీలు ఎక్కువగా లాగుతున్నారని ఆరోపిస్తూ తాము మావోయిస్టులమంటూ కొంత మంది ఇద్దరు ఫైనాన్షియర్లను కిడ్నాప్ చేశారు. లావాదేవీలు ఆపాలని ఆ ఫైనాన్షియర్లను కిడ్నాపర్లు హెచ్చరించారు. కిడ్నాప్ చేసినవారు మావోయిస్టులా, మరెవరైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ సుబ్బారెడ్డి కోసం గాలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X