వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెలికాం స్కామ్ పై అట్టుడికిన పార్లమెంటు, వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: టెలికాం శాఖ మంత్రి ఎ రాజా రాజీనామా చేసినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించలేదు. టెలికాం శాఖలో 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ జరిపించాలని పట్టుబట్టాయి. జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విపక్షాల సభ్యులు సభలను స్తంభింపచేశారు. సోమవారం ప్రారంభంకాగానే 2జీ స్పెక్ట్రమ్‌పై నిరసనలు వెల్లువెత్తడంతో ఉభయ సభలు మంగళవారం నాటికి వాయిదా పడ్డాయి.

సోమవారం లోక్ సభ ప్రారంభంకాగానే 2జీ స్పెక్ట్రమ్ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని బీజేపీ పట్టుపట్టి, సభలో నిరసనలు తెలిపింది. దీంతో స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకుండా నిరసన తెలుపుతూ పోడియం వద్దకు దూసుకుపోయారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనంగా వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం తిరిగి ఉభయ సభలు ప్రారంభంకాగానే పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినక జేపీసీకి డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో ఉభయ సభలూ మంగళవారంనాటికి వాయిదా పడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X