వైయస్ జగన్ పై ఏఐసిసి సీరియస్: నివేదిక ఇవ్వాలని పిసిసికి ఆదేశం

సమగ్ర నివేదిక అందించాల్సిందిగా పిసిసిని ఏఐసిసి కోరింది. నివేదిక అందిన తర్వాతనే షోకాజ్ నోటీసుపై నిర్ణయముంటుందని అవకాశం. పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ వెంటనే అధిష్టానానికి నివేదిక పంపినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వచ్చిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువ్చిచిన ఘనత సోనియాగాంధీదేనని అన్నారు. కాగా జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం లేదని గోనె ప్రకాశరావు ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన క్షమాపణలు కోరే అవకాశముందన్నారు. కానీ సొంత పార్టీ పెట్టే అవకాశం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications