జనవరి 2 నుంచే వైయస్ జగన్ కు నిజమైన పరీక్ష

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ కు నిజమైన పరీక్ష వచ్చే ఏడాది 2వ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. జనవరి రెండో తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఆయన ఓదార్పు యాత్ర చేపడుతారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యాత్ర ఉంటుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆయన ఓదార్పు యాత్ర చేస్తారు. పార్టీ పెట్టిన తర్వాత ఈ యాత్ర చేపడతారా, యాత్ర తర్వాత పార్టీ పెడతారా అనేది స్పష్టం కావడం లేదు. పార్టీ స్థాపనకు మరో ఒకటి రెండు నెలలు పడుతుందని వైయస్ జగన్ వర్గీయులు అంటున్నారు.

వైయస్ జగన్ ఓదార్పుయాత్రకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఉత్తరాంధ్ర కాంగ్రెసు నాయకులకు సూచించారు. ఈ స్థితిలో ఆయనకు గత ఓదార్పు యాత్రల్లో లభించిన ఆదరణ ఈ ఓదార్పు యాత్రలో లభిస్తుందా, లేదా అనేది చూడాల్సి ఉంది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తమతో చేతులు కలపడానికి ముందుకు రావడంతో వైయస్ జగన్ వర్గానికి ఏదో మేరకు బలం చేకూరిందని చెప్పవచ్చు. ఓదార్పు యాత్ర చేపట్టే లోపల మరింత మంది వైయస్ జగన్ కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+