హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుల కోసమే చంద్రబాబునాయుడి దీక్ష: జగన్ వర్గం గోనె ప్రకాశరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఫైలుపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంతకం చేయలేదు అన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెస్ నాయకుడు గోనె ప్రకాశరావు ధ్వజమెత్తారు. బొత్స సత్యనారాయణ కుటుంబ పాలనలో విసిగిపోయిన ఆయన జిల్లావాసులు పార్టీనుండి బయటకు రావాలనుకుంటున్నారన్నారు. జిల్లాలో బొత్స కుటుంబమే రాజ్యమేలుతుందన్నారు.

దివంగత వైఎస్ పై మంత్రి బొత్స ఇప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఏమీ మాట్లడాని బొత్స ఇప్పుడు మాట్లాడటం మంచిది కాదన్నారు. బొత్స రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బొత్స వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం మానివేసి ప్రజల సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి ఆలోచించాలని చెప్పారు. రైతు సమస్యల కోసం ఎవరు దీక్షలు చేసిన తప్పు పట్టాల్సిన పని లేదన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి దీక్ష అయినా, వైఎస్ జగన్ దీక్షను అయినా తప్పు పట్టాల్సిన పని లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X