బొత్స సత్యనారాయణను నిలువరించిన వైయస్ జగన్ సాక్షి డైలీ

''2009 లో ప్రమాణ స్వీకారం రోజున 9 గంటల ఉచిత విద్యుత్ ఫైలుపై ఆనాడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంతకం చేశారు. ఆ ఖరీఫ్ నుంచి అమలు చేస్తామన్నారు. కానీ అమలు చేయలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల చేయలేకపోయాం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాక, విద్యుత్ ఉత్పాదన పెరిగాక అమలుచేద్దామన్నారు. ఆర్థికమాంద్యం, ఖజానా పరిస్థితిని పరిశీలించి వెసులుబాటుకు అవకాశాలపై అధికారులను అధ్యయనం చేయమన్నారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వైఎస్ మాతో చెప్పారు. వైఎస్ నిర్ణయాల్లో మేమంతా భాగస్వాములం. నేను ఒకటి చెప్తే 'సాక్షి" మరో విధంగా అర్థం చే సుకొని నన్ను కించపరిచే విధంగా వ్యవహరించింది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు"" అని బొత్స సత్యనారాయణ వివరించారు.












Click it and Unblock the Notifications