వైయస్ జగన్ లక్ష్య దీక్ష ప్రారంభం: భారీగా వచ్చిన అభిమానులు

దీక్ష ప్రాంగణం వేదిక మీది నుంచి వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ప్రసంగించారు. రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని, రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైయస్ జగన్ పెట్టిన డిమాండ్లను రైతు శ్రేయస్సు కోసం అంగీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు మాకినేని పెదరత్తయ్య కూడా మాట్లాడారు. రైతుల పట్ల నిబద్ధత గల నాయకుడు వైయస్ జగన్ ఒక్కరేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్రానికి వైయస్ జగన్ నాయకత్వమే శరణ్యమని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications