విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ 11 సీట్లే ఎందుకు గెలిచింది: కెసిఆర్‌ ను ప్రశ్నించిన టిజి

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
విజయవాడ: తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంతగా చిత్తశుద్ధితో పోరాడితే తెలంగాణలోని పది జిల్లాలో ఉన్న 119 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఎలా వచ్చాయని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖమంత్రి టిజి వెంకటేష్ సోమవారం విజయవాడలో విలేకరుల ప్రతినిధుల సమక్షంలో ప్రశ్నించారు. కేసిఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ 11 సీట్లే గెలుచుకోవటం దేనికి నిదర్శనమన్నారు.

అంత తక్కువ సీట్లు గెలుచుకోవడానికి కారణం తెలంగాణపై కెసిఆర్ కు చిత్తశుద్ది లేకపోవడమా లేదా తెలంగాణలో ప్రత్యేక సెంటిమెంటు లేకపోవడమా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనతో ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనన్నారు. కృష్ణా నీటిపై కేంద్రం వేసిన బ్రజేష్ కమిటీ తీర్పు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్నారు. అయితే నష్టం జరిగితే అంతటితో ప్రభుత్వం ఊరుకోదని అప్పీలుకు వెళుతుందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X