వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు సిఫార్సులు ఆచరణ సాధ్యం కావని కమిటీయే చెప్పింది: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: మొదటి మూడు సిఫార్సులు ఆచరణ సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీయే చెప్పిందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. అఖిల పక్ష సమావేశం అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాలో అయిదు ప్రత్యామ్నాయాలు మాత్రమే వస్తున్నాయని, కమిటీ ఆరు ప్రత్యామ్నాయాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. తన అభిప్రాయాలకు కమిటీ కారణాలు కూడా చెప్పిందని ఆయన అన్నారు. కమిటీ నివేదికను పూర్తిగా చదివిన తర్వాతనే మాట్లాడాలని ఆయన రాజకీయ పార్టీలను కోరారు.

కమిటీ నివేదికను చదవండి, అర్థం చేసుకోండి, మాట్లాడండి అని ఆయన కోరారు. కమిటీ నివేదికపై తక్షణమే ఓ నిర్ణయానికి రావద్దని ఆయన సూచించారు. పూర్తిగా చదివిన తర్వాత తుది నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి నివేదికను చదవవద్దని, ఓపెన్ మైండ్‌తో చదవాలని ఆయన అన్నారు. తమకు సహకరించాలని ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను మీడియాను కోరారు. అఖిల పక్ష సమావేశానికి కొన్ని పార్టీలు రాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X