హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో మళ్లీ ఉద్రిక్తత: ర్యాలీగా వస్తున్న విద్యార్థులపై కాల్పులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు మళ్లీ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియాను పోలీసులు విశ్వవిద్యాలయంలోకి అనుమతించడం లేదు. తెలంగాణ కోరుతూ ర్యాలీగా వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని తమ ఆందోళనను అడ్డుకోవద్దని పోలీసులను వారు కోరారు. అయినప్పటికీ పోలీసులు వారి ర్యాలీకి అడ్డగించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

బయటకు వెళతామన్న విద్యార్థులను పోలీసులు అడ్డగించారు. దీంతో ఎన్‌సీసీ గేటు వద్ద తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట బాష్పవాయువు ప్రయోగించారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు. కాగా గురువారం పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రవికుమార్‌తో పాటు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X