మద్దెలచెర్వు సూరి హత్యకు కారణాలేమిటి?: సాక్షి టీవీ చానెల్ రిపోర్ట్
సూరికి, భానుకు మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయని, సూరికి చెందిన 300 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు భాను పేర ఉన్నాయని, వాటిని తమ పేరు మీదికి మార్చాలని సూరి ఒత్తిడి తెస్తున్నాడని, దాంతో భాను సూరిని అంతం చేసి ఉంటాడని మరో కారణంగా సాక్షి వివరించింది. పరిటాల వర్గీయులు సూరిని హత్యకు ప్లాన్ చేశారా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. జైలులో ఉన్న పోతుల సురేష్, బెల్గాంలో ఉన్న చమన్ సూరి హత్యకు ఒప్పందం చేసుకున్నారని, అందుకు 20 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని, 9 కోట్ల రూపాయల చెల్లింపు కూడా జరిగిందని, ఇది సూరి హత్యలో దర్యాప్తునకు నోచుకున్నమరో కోణమని సాక్షి టీవీ చానెల్ వివరించింది. సూరి హత్యలో విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడి పాత్ర ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పింది.
రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర సినిమా లాభాలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చునని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత సూరి పెట్టుబడులు పెట్టిన రెండు భారీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. రాయలసీమ ఫాక్షనిజానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కోణంలో సాక్షి టీవీ చానెల్ ముక్తాయింపు ఇచ్చింది. వైయస్ చర్యల వల్ల రాయలసీమలో చాలా వరకు ఫాక్షనిజం తగ్గిందని చెప్పింది.