గుంటూరు ఆర్టీసి డిపోలో రూ. 20 లక్షల స్కామ్, సిస్టమ్ సూపర్‌ వైజర్ పనే

Guntur
గుంటూరు: గుంటూరు - 2 ఆర్టీసి డిపోలో 20 లక్షల రూపాయల కుంభకోణం వెలుగు చూసింది. సిస్టమ్ సూపర్‌వైజర్ మస్తాన్ రావు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు విచారణాధికారులు గుర్తించారు. ఇందులో కొంత మంది ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కండక్టర్ లేకుండా సీల్ చేసిన సిస్టమ్ ద్వారా డ్రైవర్లు టికెట్లు ఇచ్చే పద్ధతిని ఆసరా చేసుకుని మస్తాన్ రావు ఈ అవినీతికి పాల్పడినట్లు భావిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితమే ఈ కుంభకోణం వెలుగు చూసింది. అయితే, మంత్రి బొత్స సత్యనారాయణ గుంటూరు పర్యటన వల్ల బయటకు రాకుండా దాన్ని కప్పిపెట్టారు.

ఓ ఆగంతకుడు ఇచ్చిన సమాచారంతో ఆర్టీసి అధికారులు విచారణ చేపట్టారు. గత ఆరు నెలలుగా ఈ మస్తాన్ రావు ఈ అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మస్తాన్ రావును విధుల నుంచి తప్పిస్తామని ప్రాంతీయ మేనేజర్ చెప్పారు. గుంటూరు -2 డిపోలో ఈ కుంభకోణం వెలుగు చూడడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై ఇతర డిపోల్లో కూడా విచారణకు సిద్ధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+