శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై చర్యలు: జగన్ వెంట వెళ్లడంపై చిరు

Chiranjeevi
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ జలదీక్షకు వెళ్లిన తమ శానససభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై చర్యలు తీసుకుంటామని, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుందన్న అనుమానం తమ పార్టీకి లేదని ఆయన తెలిపారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తాము గతంలో ప్రజాభీష్టం మేరకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని, ప్రభుత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. గురువారమిక్కడ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఆయన సుమారు గంటసేపు సమావేశమయ్యారు. చిరంజీవితోపాటు ఆయన సోదరుడు నాగబాబు రాజ్‌ భవన్‌కు వెళ్లినప్పటికీ ఆయన బయటే ఉన్నారు. చిరంజీవి ఒక్కరే నరసింహన్‌తో భేటీ అయ్యారు. సమావేశానంతరం చిరంజీవి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

గవర్నర్‌తో జనవరి 1న భేటీ అవుదామనుకున్నానని, ఇద్దరికీ కుదరకపోవడంతో అప్పుడు మాట్లాడలేకపోయానని, సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికే ఇప్పుడు వచ్చానని, మా సమావేశానికి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదని, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి రెండు మూడు నిమిషాలే చర్చ సాగిందని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి నేపథ్యంలో అశాంతి చెలరేగుతుందని అందరూ భయపడ్డారని, కానీ అలాంటి పరిస్థితి లేదని, రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనడం శుభపరిణామమని చిరంజీవి వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో ఇదే విషయమై సంతోషం వ్యక్తం చేశానన్నారు. కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం శుభపరిణామమని, తమ పార్టీ చేసిన సూచనతోనే నివేదికలో ఆరో ప్రతిపాదన రూపొందించారని, ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలనడం మంచిదని దీన్ని మేం స్వాగతిస్తున్నామని చిరంజీవి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+