హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ శివారులో కాల్పులు: ట్రాన్స్‌పోర్టు ఆఫీసు మేనేజర్‌కు గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ శివారులో బుధవారం సాయంత్రం కాల్పులు చోటు చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. హైదరాబాదు శివారులోని వనస్థలిపురం సమీపంలో గల ఆటోనగర్‌లోని ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం యజమానిపై కాల్పులు జరిగాయి. ఎక్స్‌ప్రెస్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం మేనేజర్ నవీన్ జైస్వాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఎల్బీ నగర్‌లోని ఆరెంజ్ ఆస్పత్రికి తరలించారు.

జైస్వాల్‌కు వ్యాపార భాగస్వామికి మధ్య జరిగిన గొడవలే కాల్పులకు కారణమని అనుమానాలు తలెత్తాయి. అయితే, కార్యాలయం యజమాని రివాల్వర్ బల్లపై పెట్టి ఉందని, అది ఓ వ్యక్తి పరిశీలిస్తుండగా మిస్ ఫైర్ అయిందని పోలీసులు అంటున్నారు. జైస్వాల్‌కు ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. అతన్ని విచారిస్తున్నట్లు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X