చిరంజీవికి వైయస్ జగన్ భయం, అందుకే ఎమ్మెల్యేల భేటీ?

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ భయం పట్టుకున్నట్లే ఉంది. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి వైయస్ జగన్‌కు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో మిగతా శాసనసభ్యులను కాపాడుకునేందుకు చిరంజీవి నడుం బిగించినట్లు కనిపిస్తోంది. ఈ నెల 22వ తేదీన వైయస్ జగన్ విశాఖపట్నంలో జనదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తమ పార్టీకి చెందిన మరింత మంది శాసనసభ్యులు వెళ్లకుండా జాగ్రత్త పడాలని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. జగన్ వెంట వెళ్లిన ఇద్దరు శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు మిగతా శాసనసభ్యులకు తగిన భరోసా ఇవ్వాలని ఆయన భావించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే చిరంజీవి బుధవారం పార్టీ శాసనసభ్యులతో సమావేశమవుతున్నారు.

సమావేశానంతరం తన పార్టీ శాసనసభ్యులతో పాటు చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తారు. తమ తమ నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ తీసుకునేందుకున చిరంజీవి తన శాసనసభ్యులను తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం. దాని వల్ల వైయస్ జగన్ వైపు వారు చూడకుండా జాగ్రత్త పడాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. కాగా, మంగళవారం ఢిల్లీలో ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల మధ్య సంబంధాలపై ఆయన ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+