వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కినేని నాగేశ్వర రావుకు పద్మవిభూషణ్, గగన్ నారంగ్‌కు పద్మశ్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Akkineni Nageswara Rao
న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు లభించింది. 2010 సంవత్సరానికి ప్రకటించిన పద్మ అవార్డుల్లో పలువురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారున్నారు. వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో పల్లె రామారావును కూడా పద్మ విభూషణ్ వరించింది. కాగా, తెలుగు ప్రాంతానికి చెందిన బాలీవుడ్ నటి వహీదా రెహ్మాన్‌కు పద్మభూషణ్ అవార్డు లభించింది. డాక్టర్ గుణపాటి వెంకటృష్ణారెడ్డికి కూడా పద్మ భూషణ్ అవార్లు లభించింది. కె. అంజిరెడ్డికి పద్మభూషణ్ లభించింది. డాక్టర్ జివికె రెడ్డికి పద్మ భూషణ్ అవార్డు లభించింది.

హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుడు గగన్ నారంగ్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. క్రికెటర్ వివియస్ లక్ష్మణ్‌కు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఉషా ఉతప్‌నకు పద్మశ్రీ అవార్డు లభించింది. కాగా, ఇర్పాన్ ఖాన్, కాజోల్, టబూలకు పద్మశ్రీ లభించింది. బ్రజేష్ మిశ్రా, కృష్ణ పూనియాలకు పద్మశ్రీ లభించింది. కేల్కర్, అజీమ్ ప్రేమ్‌జీలకు పద్మ విభూషణ్ లభించింది. శ్యామ్ శరన్‌కు పద్మభూషణ్ లభించింది. సంగీత దర్శకుడు ఖయ్యూంకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. కపిల వాత్సాయనకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ముగ్గురు తెలుగువారికి పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X