హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఇష్యూయే కాడు, తెలంగాణే పెద్ద సమస్య: బొత్స సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడే మంత్రి బొత్స సత్యనారాయణ మరో సంచలన ప్రకటన చేశారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఇష్యూనే కాడని, తెలంగాణనే పెద్ద సమస్య అని ఆయన అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ సహకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చితికి, అలజడికి తెలుగుదేశం పార్టీయే కారణమని ఆయన విమర్శించారు.

తెలుగుదేశం ద్వారా మాత్రమే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తీసుకునే నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు అంగీకరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేశారని ఆయన చెప్పారు. పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచనలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణపై తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.

తెలంగాణపై సోనియా అభిప్రాయం చెప్తే చంద్రబాబు చెప్తారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అంటే అటువంటి లింక్‌లే పెట్టకూడదని, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సమస్య పరిష్కారం గురించి పనిచేయాలని మంత్రి అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కార బాధ్యతను తెలుగుదేశం కూడా కాంగ్రెసు మీద పెట్టమనండని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X