అలీబాబా 40 దొంగలకు వైయస్ జగన్ బాస్: డిఎల్ రవీంద్రారెడ్డి
జగన్ను లక్ష్యం చేసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ మృతితో కార్యక్రమం ఆగిపోయిందని, దాన్ని తాము ఇప్పుడు పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో చేపట్టామని ఆయన అన్నారు. వైయస్సార్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని తాము కూల్చబోమని అంటూనే విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలని జగన్ వర్గం అంటోందని, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తోందని ఆయన అన్నారు. జగన్ను ఆత్మరక్షణలో పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమకు బ్లాక్ మెయిల్ చేసే అలవాటు లేదని, వైయస్ జగన్కూ సాక్షి మీడియాకూ ఆ అలవాటు ఉందని, అన్ని విషయాలూ బయటపడే సమయం వచ్చిందని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, January 27, 2011, 15:35 [IST]