వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డి తివారీకి హైకోర్టులో చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: పితృత్వం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డి తివారీ డిఎఎన్ఎ పరీక్ష చేయించుకోవాలని తాను ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ ఆదేశాలపై స్టే ఇవ్వాలని తివారీ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తాను ఎన్‌డి తివారీకి జన్మించానని అంటూ తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే యువకుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి విక్రమ్ జిత్ సేన్, సిద్ధార్థ్ మృదుల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నిరాకరించింది.

డిఎన్ఎ పరీక్ష కోసం తివారీ రక్తాన్ని మంగళవారం సేకరించే జాయింట్ రిజిస్టార్ కార్యక్రమాన్ని నిలుపుదల చేయడానికి కూడా హైకోర్టు నిరాకరించింది. తన తల్లి ఉజ్వల శర్మతో తివారీ నడిపిన శృంగారం వల్ల తాను పుట్టానని రోహిత్ శేఖర్ వాదిస్తున్నాడు. తాను తివారీకి పుట్టానా, లేదా రుజువు చేయడానికి డిఎన్ఎ పరీక్ష నిర్వహించాలని ఆయన కోర్టును కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X