వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి సమైక్యవాద కుట్ర: పొన్నం ప్రభాకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: తమ పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి సమైక్యవాదాన్ని తెర మీదికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను లక్ష్యం చేసుకోవడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉద్యమంలో పాల్గొనాలని కోరడం వేరు, వారిని లక్ష్యం చేసుకోవడం వేరని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి తమ పార్టీ శాసనసభ్యులను లక్ష్యం చేసుకోవద్దని ఆయన కోరారు.

సీమాంధ్ర నేతలు తెలంగాణను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు సమైక్యవాద నిర్ణయాన్ని వదిలేసి జై ఆంధ్ర నినాదాన్ని ముందుకు తేవాలని ఆయన కోరారు. తెలంగాణపై గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగాలని చూస్తోందని, ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అన్నారు. ఉద్యోగులు సొంత ప్రయోజనాల కోసం ఆందోళన చేయడం లేదని, తెలంగాణ కోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region MP Ponnam Prabhakar lashed out at his party Seemandhra MLAs JC Diwakar Reddy and Gade Venkat Reddy accusing anti telangana activities. He appealed to Telangana JAC not to target Congress Telangana MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X