7న కాకరాపల్లికి వైయస్ జగన్, ప్రభుత్వ తీరుపై మండిపాటు

YS Jagan
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి బాధితులను మాజీ పార్లమెంటు సభ్యుడు ఈ నెల 7వ తేదీన పరామర్శించనున్నారు. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనకు వైయస్ జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ తీవ్రంగా మండిపడ్డారు. థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల సమస్యను అర్థం చేసుకుని ప్రభుత్వం ముందస్తుగా స్పందించి ఉంటే అసలు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదన్నారు. పోలీసులు ఏకపక్షంగా ఆందోళనకారులపై కాల్పులు జరపడం అమానుషమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

దీనిపై స్థానిక ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించింది. జీవనోపాధి కోల్పోతామన్న భయంతో ఆందోళన చేస్తున్న స్థానికులపై పోలీసులు ఏకపక్షంగా తుపాకులు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించడమే కాకుండా పూరిగుడిసెలను, గడ్డివాములను తగులబెట్టి వారికి నిలువనీడ లేకుండా చేయడంప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. సంఘటనకు బాధ్యులైన వారిని సస్పెండు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఆందోళన చెందుతున్న స్థానిక ప్రజలకు స్పష్టమైన భరోసా కల్పించడంతో పాటు అక్కడ సాధారణ పరిస్థితులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+