వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేయాలంటే కావూరి పారిపోయాడు: గుత్తా సుఖేందర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gutta Sukhender Reddy
న్యూఢిల్లీ: రాజీనామాలు చేద్దామంటే తమ పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు పారిపోయాడని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన రాజీనామా పత్రంతో సహా కావూరి రాజీనామా పత్రం తయారు చేసి ఇద్దరం రాజీనామా చేద్దామని తాను అడిగానని, నేనెందుకు చేస్తానంటూ కావూరి సాంబశివరావు పారిపోయాడని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. తాము రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉన్నామని, తెలంగాణకు వ్యతిరేకంగా తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే వెంటనే వాటిని స్పీకర్‌కు అందజేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ కోసం తాము ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు మందా జగన్నాథం చెప్పారు. నిన్న, మొన్న తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం తమతో మాట్లాడుతుందని అనుకున్నామని, అయితే మాట్లాడకపోవడంతో ఈ రోజు పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్నామని ఆయన చెప్పారు. ఈ రోజు రాత్రి తమతో చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారని, దాంతో మధ్యాహ్నం తర్వాత పార్లమెంటు సమావేశాలను అడ్డుకోకూడదని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్దిష్టమైన చర్చలు ప్రారంభించే వరకు తాము పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఎవరి దారిలో వాళ్లం పోరాటం చేద్దామని పొన్నం ప్రభాకర్ అన్నారు.

English summary
Congress Telangana region MP Gutta Sukhender Reddy lashed out at his party Seemandhra MP Kavuri Sambasiva Rao on resignation issue. He said that Congress Telangana MPs are ready to resign for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X