హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిలియన్ మార్చ్ యథాతథం: పరీక్ష దృష్ట్యా 1 నుండి ప్రారంభం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: మార్చి 10వ తేదిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మిలియన్ మార్చ్ యథాతథంగా ఉంటుందని కమిటీ సోమవారం ప్రకటించింది. విద్యార్థుల ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని పలు విజ్ఞప్తులు వచ్చిన దృష్ట్యా పరిశీలిస్తామని జెఏసి చర్చిని నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీంతో మిలియన్ మార్చ్‌ను వాయిదా వేస్తారనే వాదనలు వినిపించాయి.

సోమవారం సాయంత్రం జేఏసి చర్చించి మార్చ్ యథాతథంగా ఉంటుందని ప్రకటించింది. మార్చి 10వ తేదిన ప్రజలు రోడ్లపైనే వంటావార్పు చేసుకోవారని కోరారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తెలంగాణ ఆకాంక్షను తెలియజేయాలన్నారు. పరీక్షల దృష్ట్యా మార్చ్ మధ్యాహ్నం 1 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని కోదండరాం చెప్పారు. కాగా ఇంటర్ పరీక్షల దృష్ట్యా, తెలంగాణ ఉద్యమం దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో నిషేధాజ్ఞలు ఉన్నాయని నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ తెలిపారు.

ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలకు ఎక్కడా మార్చి 13వ తారీఖు వరకు ఆమోదించలేదన్నారు. పరీక్షల దృష్ట్యా అందరూ సహకరించాలని ఆయన కోరారు. నగరంలో 144వ సెక్షన్ ఉంటుందని అన్నారు. ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా సైబరాబాద్ పరిధిలో కూడా కఠిన ఆంక్షలు ఉంటున్నట్టు కమిషనర్ తిరుమలరావు చెప్పారు.

English summary
Telangana JAC confirmed that Million March will held on March 10. They said there is no change on Chalo Hyderabad. Other way Hyderabad Police Commissioner AK Khan warned that there is permission to any rallyes, dharnas and public meetigs up 13th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X