రౌడీయిజం చేయడానికి వైయస్ భయపడేవారు: చంద్రబాబు
ముఖ్యమంత్రి సమక్షంలోనే సభలో దాడి జరిగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారన్నారు. చేతులెత్తేసిన సిఎంను తాను ఎన్నడూ చూడేదన్నారు. అసెంబ్లీలో రౌడీయిజం చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలకే భద్రత లేనప్పుడు ఇక రాష్ట్రంలో సామాన్యుని పరిస్థితి ఏమిటన్నారు. మండలిలో లీడర్ వైయస్ వివేకా ఇలా వ్యవహరిస్తారని తాను అనుకోలేదన్నారు.
అయితే ప్రజా సమస్యలపై స్పందించడానికి టిడిపి ఎప్పుడూ ముందుంటుదన్నారు. ఎవరు బెదిరించినా భయపడేది లేదన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచడమే తమ లక్ష్యమన్నారు. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందేనని ఆయన అన్నారు. టిడిపి హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా జెఎల్పీకి సిద్ధమని ఆయన అన్నారు.
chandrababu naidu kiran kumar reddy ys vivekananda reddy congress hyderabad చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
TDP president Chandrababu Naidu condemned minister YS Vivekananda Reddy and ex MP YS Jaganmohan Reddy camp MLAs attack on TDP MLAs.
Story first published: Monday, March 28, 2011, 14:03 [IST]