తండ్రి నాదెండ్ల భాస్కర రావులా మిగిలిపోతారా: మనోహర్కు రేవంత్ ప్రశ్న
గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనలకు తెలంగాణ ప్రాంత సభ్యులను సస్పెండ్ చేసిన డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనకు బాధ్యులైనవారిని కూడా సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. ఒక వేళ వివేకానందరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే కొంత మంది ఒత్తిడికి లోనై, సీమాంధ్ర సభ్యుల పట్ల వివక్ష చూపుతున్న సభాపతిగా మనోహర్ మిగిలిపోతారని ఆయన అన్నారు. సభ సీమాంధ్ర సభగా, సీమాంధ్రుల అక్రమాలను కాపాడే సభగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల వీడియోలను మీడియాకు విడుదల చేసిన నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని ఆయన అన్నారు. మీడియాకు నాటి సంఘటనల వీడియోలను విడుదల చేసి తమపై చర్యలు తీసుకున్నారని, నేటి సంఘటనలపై కూడా అదే వైఖరిని తీసుకోవాలని ఆయన అన్నారు. దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోకపోతే నాదెండ్ల మనోహర్పై ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.