వివేకాను బర్తరఫ్ చేయాలి, జగన్ వర్గంను సస్పెండ్ చేయాలి: టిడిపి

టిడిపి కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. వాటిపై జెఎల్పీ కోసం టిడిపి పట్టుబడిందన్నారు. వైయస్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు భారీగా రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకున్నప్పుడు మాట్లాడని మంత్రి వివేకానందరెడ్డి వైయస్ పాలనలో జరిగిని అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. ఆరోపణలకు సమాధానాలు చెప్పవలసిన మంత్రి దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. భూకేటాయింపులపై జెఎల్పీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శాసనసభలో ఇలాంటివి చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని మాజీ మంత్రి అశోక గజపతి రాజు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారు వీధి రౌడిల్లా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. టిడిపి సభ్యులపై దాడి చేసిన మంత్రి వివేకానందరెడ్డిని, జగన్ వర్గం ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో ఎవరికైనా ఏమైనా మాట్లాడే అర్హత ఉందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభలోకి వచ్చి రౌడీల్లా ప్రవర్తించడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అన్నారు. నేనే ముఖ్యమంత్రిని అయితే 5 నిమిషాలలో వారిని బర్తరఫ్ చేసేవాడిని అని అన్నారు. ముఖ్యమంత్రి వారిని సభ నుండి సస్పెండ్ చేయకుండే సరికాదన్నారు. అలా చేయకుంటే సభా హక్కుల ఉల్లంఘన పెడతామని అన్నారు.
అసెంబ్లీ పట్ల ప్రజాప్రతినిధులకు గౌరవం తగ్గిపోయినట్లుగా కనిపిస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో దాడి చేసే శాసనసభ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరాచకానికి పాల్పడ్డవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో సభ్యులను సభనుండి సస్పెండ్ చేయాలన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications