హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకాను బర్తరఫ్ చేయాలి, జగన్ వర్గంను సస్పెండ్ చేయాలి: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ashok Gajapathi Raju
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కండబలం ఉపయోగించి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి మీడియాతో కూడా మాట్లాడారన్నారు.

టిడిపి కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. వాటిపై జెఎల్పీ కోసం టిడిపి పట్టుబడిందన్నారు. వైయస్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు భారీగా రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకున్నప్పుడు మాట్లాడని మంత్రి వివేకానందరెడ్డి వైయస్ పాలనలో జరిగిని అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. ఆరోపణలకు సమాధానాలు చెప్పవలసిన మంత్రి దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. భూకేటాయింపులపై జెఎల్పీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శాసనసభలో ఇలాంటివి చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని మాజీ మంత్రి అశోక గజపతి రాజు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారు వీధి రౌడిల్లా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. టిడిపి సభ్యులపై దాడి చేసిన మంత్రి వివేకానందరెడ్డిని, జగన్ వర్గం ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో ఎవరికైనా ఏమైనా మాట్లాడే అర్హత ఉందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభలోకి వచ్చి రౌడీల్లా ప్రవర్తించడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అన్నారు. నేనే ముఖ్యమంత్రిని అయితే 5 నిమిషాలలో వారిని బర్తరఫ్ చేసేవాడిని అని అన్నారు. ముఖ్యమంత్రి వారిని సభ నుండి సస్పెండ్ చేయకుండే సరికాదన్నారు. అలా చేయకుంటే సభా హక్కుల ఉల్లంఘన పెడతామని అన్నారు.

అసెంబ్లీ పట్ల ప్రజాప్రతినిధులకు గౌరవం తగ్గిపోయినట్లుగా కనిపిస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో దాడి చేసే శాసనసభ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరాచకానికి పాల్పడ్డవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో సభ్యులను సభనుండి సస్పెండ్ చేయాలన్నారు.

English summary
TDP MLAs Dulipalla Narendra and Ashok Gajapathi Raju demanded to suspend Minister YS Vivekananda Reddy and YS Jaganmohan Reddy camp MLAs today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X