కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయి వైయస్పై బురద చల్లుతున్నాయి: జగన్

వైయస్ రాజశేఖర రెడ్డి ఓ మాట చెబుతూ ఉండేవారని, మనం బతికి ఉండగా ఎంత మంది జైజైలు కొట్టారనేది ముఖ్యం కాదనీ మరణించిన తర్వాత ఎంత మంది గుండెల్లో నిలిచిపోయామనేది ముఖ్యమని చెబుతూ ఉండేవారని, ఆ మాటలే శ్రీరామరక్షగా తాను ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం కూడదని చెప్పేవారమని, ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదనీ ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతూ ఉండేవారని ఆయన అన్నారు. విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు వైయస్సార్ అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications