హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరికృష్ణకు చంద్రబాబు షాక్: కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉమ కొనసాగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Harikrishna
హైదరాబాద్: తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు చేసిన రాజీనామాను చంద్రబాబు తిరస్కరించారు. పార్టీ పదవిలో కొనసాగాలని ఆయన ఉమను అదేశించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లాలోని పార్టీలో నెలకొన్న విభేదాలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరిని ఆదేశించారు. ఉమను కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకోవడం ద్వారా హరికృష్ణకు చంద్రబాబు షాకిచ్చారు. హరికృష్ణ అనుచరుడు వంశీ తిరుగుబాటును చంద్రబాబు లెక్కచేయలేదనే భావించవచ్చు.

తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దేవినేని ఉమ నాయకత్వంలో తాను పని చేయలేనని, పార్టీ పదవికి రాజీనామా చేస్తానని వంశీ ప్రకటించారు. దాంతో తన పార్టీ పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు రాజీనామా చేశారు. దేవినేని ఉమ రాజీనామా చేశారు కాబట్టి తాను పార్టీ పదవిలో కొనసాగుతానని వంశీ ప్రకటించారు. అయితే, పరిస్థితి వంశీకి ఎదురు తిరిగింది.

English summary
TDP president N Chandrababu Naidu ignored Harikrishna's follower Vallabhaneni Vamshi's threat. Chandrababu decided to continue Devineni Uma as party Krishna district president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X