యాగాలతో తెలంగాణ వస్తే తెరాస ఎందుకు: కెసిఆర్ను ప్రశ్నించిన నారాయణ

జీవో 177ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగ సంఘాలతో కలసి ఆందోళన చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి ప్రయివేటీకరణ యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నిక ప్రచారానికి 17మంది మంత్రులు వెళ్లడాన్ని ఆయన ఆక్షేపించారు. నో వర్క్ నో పే అంటూ ఉద్యోగుల ఆందోళనలను నిషేధిస్తూ ప్రభుత్వం 177 జీవోను జారీ చేసింది. రాజకీయ సమ్మెలున్నంత కాలం పౌర హక్కుల సమ్మెలుంటాయని నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications