హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల తర్వాత సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మార్పు: గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Gone Prakash Rao
హైదరాబాద్: కడప జిల్లా ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓటమి ఖాయమని, ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఖాయమని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత గోనె ప్రకాశ్ రావు ఆదివారం అన్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తరహాలోనే వ్యవహరించారన్నారు. అప్పుడ ఇందిర రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని భవనం వెంకట్రాంను ముఖ్యమంత్రిగా చేసిందని, ఇప్పుడు సోనియా సొంత జిల్లా చిత్తూరులో బలం లేని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిందని అన్నారు.

ఉప ఎన్నికలలో ప్రచారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు అందరినీ పంపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళా మంత్రులు అందరినీ పులివెందుల వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి వ్యాపార కుటుంబం అని ఆయన తెలిపారు. రాజకీయాలలోకి రాకముందే ఆయన ఆదాయపు పన్ను చెల్లించారని చెప్పారు.

జగన్మోహన రెడ్డి కూడా తన తండ్రి ముఖ్యమంత్రి కాకముందు నుంచే దేశంలోని పలు రాష్ట్రాలలో చట్టబద్దమైన వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి జగన్‌కు రెండు లక్షల ఆధిక్యం రాదని చెప్పడం ద్వారా జగన్ గెలుపును ఖాయం చేశారని అన్నారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp leader Gone Prakash Rao said today that CM Kirankumar Reddy will replaced after election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X